ETV Bharat / jagte-raho

భూవివాదంలో ఇరు వర్గాల ఘర్షణ.. 25 మందిపై కేసు

author img

By

Published : Jul 12, 2020, 11:34 AM IST

Conflict between the two factions in the land dispute
భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 25 మందిపై కేసు

సూర్యాపేట జిల్లా నేలమర్రిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రభుత్వం దళితులకు అందజేసిన మూడెకరాల భూమి విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో 2017లో.. గ్రామానికి చెందిన 20 మంది రైతులకు ప్రభుత్వం తరఫున 60 ఎకరాల భూమిని అందజేశారు. గ్రామంలో మరింత మంది అర్హులు ఉండటం వల్ల భూమిని అందరూ కలిసి సాగు చేసుకునే విధంగా పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఈ విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఆ భూమిలో కొందరు సాగు చేసేందుకు వెళ్లగా పట్టాలు పొందిన 20 మంది రైతులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. 25 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 25 మందిపై కేసు

ఇదీచూడండి: ఆస్తికోసం కన్నతల్లిని చితకబాదిన 'సుపుత్రులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.