ETV Bharat / jagte-raho

దొంగనోట్ల చెలామణి.. నిందితుడి అరెస్ట్

author img

By

Published : Jan 23, 2021, 4:51 PM IST

నకిలీ రెండువేల నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి కారు, తొమ్మిది దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Circulation of fake two thousand notes person Arrested in sangareddy district
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాలాజీ

దొంగనోట్ల చెలామణికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. జిల్లాలోని అల్లదుర్గ్​ గ్రామానికి చెందిన ఉప్పరి ప్రసాద్​ గతంలోనూ నకిలీ నోట్ల చెలామణి కేసులో నిందితుడేనని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి కారు, తొమ్మిది రెండువేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 7వ తేదీన విజయనగర్ కాలనీలోని ఓ షాపులో నకిలీ రెండువేల నోటుతో 200 రూపాయలు కొనుగోలు చేసి రూ.1800 నగదును తీసుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గతంలో మిగిలిన నోట్లు మారుస్తూ..

ఇంతకుముందు ఇలాంటి కేసులోనే బెయిల్​పై బయటకు వచ్చిన నిందితుడు మిగిలిన నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నాడు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు.

ఇదీ చూడండి : 'గులాబీ ఇచ్చి చెబుతున్నం... ట్రాఫిక్ రూల్స్ పాటించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.