ETV Bharat / jagte-raho

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పశువులు మృతి

author img

By

Published : Jan 10, 2021, 4:07 PM IST

9 cows and buffaloes died at ankushapur in janagama district
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పశువులు మృతి చెందాయి

నిన్న సాయంత్రం పాలు ఇచ్చిన పశువులు.. తెల్లారేసరికి మృతి చెందడం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశపూర్​లో కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సలీమ్, కాళిల్​కు చెందిన తొమ్మిది పశువులు మృత్యువాతపడ్డాయి. శనివారం సాయంత్రం పాలు పిండుకొని మేత వేసి రాగ.. ఉదయం వెళ్లి చూడగా మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఎవరో విషప్రయోగం చేసి చంపినట్లు వారు అనుమానిస్తున్నారు.

మృతి చెందిన పశువుల్లో 3 జేర్సీ ఆవులు, ఒక గేదె, 3 లేగ దూడలు, 2 దూడలు ఉన్నాయి. తాము వాటి సంపాదనతోనే బతుకుతున్నామని.. వాటి విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై హరిత.. కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి: సంక్రాంతికి కరకరలాడే జంతికలను చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.