ETV Bharat / international

బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది దుర్మరణం

author img

By

Published : Dec 9, 2022, 8:30 PM IST

Etv Bharat
Etv Bharat

బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

ఇండోనేసియాలోని సుమత్రా ప్రావిన్స్​లో ఉన్న ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇద్దరిని రక్షించి.. తక్షణ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి.

మైనింగ్​ జరుపుతుండగా మీథేన్ వాయువు పెద్దమొత్తంలో విడుదల అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. బ్లోయర్ల సహాయంతో గని నుంచి మీథేన్​ను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 14మంది కార్మికులు గనిలోపల ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.