ETV Bharat / international

క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. కీవ్​లో అంధకారం.. జెలెన్​స్కీ ఫైర్!

author img

By

Published : Nov 15, 2022, 10:34 PM IST

ఉక్రెయిన్​పై రష్యా విరుచుకుపడుతోంది. దాదాపు 85 క్షిపణులను తమ దేశంపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. అలాగే తమదేశ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

russia missile attack on ukraine
ఉక్రెయిన్ రష్యా యుద్ధం

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా దాదాపు 85 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆయన వెల్లడించారు. రష్యా దాడుల తర్వాత చాలా నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని జెలెన్​స్కీ తెలిపారు. రష్యా దాడులకు భయపడమని.. ఇవి ప్రణాళికతో చేసిన దాడులని ఆయన అన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధికారి.. క్షిపణుల దాడిని క్లిష్టమైనవిగా అభివర్ణించారు. ఉక్రేనియన్లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో పలు నివాస భవనాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. కీవ్​లో ఐదు అంతస్తుల నివాస భవనం అగ్నికి ఆహుతైందిని.. మరో మూడు నివాస భవనాలు ధ్వంసమయ్యాయని అన్నారు.

అంతకుముందు, ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సమావేశంలో వీడియో కాల్ ద్వారా జెలెన్​స్కీ ప్రసంగించారు. జీ 20 సమావేశాన్ని.. జీ19 సమావేశంగా ఆయన అభివర్ణించారు. రష్యాను ఈ కూటమి నుంచి మినహాయించాలని కోరారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన రష్యన్​ మిలిటరీ, రాజకీయ ప్రముఖులను విచారించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేయాలని జెలెన్​స్కీ కోరారు.

ఇవీ చదవండి: చైనా బోర్డర్​లో భారత్‌- అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు

మోదీ, బైడెన్ భేటీ.. అందుకు థ్యాంక్స్ చెప్పిన ప్రధాని.. రిషితో ముచ్చట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.