ETV Bharat / international

మోదీ, జగన్​పై అమెరికా​ కోర్టులో డాక్టర్​ దావా.. పెగసస్​ స్పైవేర్​ను​ ఉపయోగిస్తున్నారంటూ..

author img

By

Published : Sep 1, 2022, 10:24 AM IST

భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్​పై ఓ ఇండో అమెరికన్​ డాక్టర్.. కోర్టులో​ దావా వేశారు. రాజకీయ ప్రత్యర్థులపై పెగసస్ స్పైవేర్​ను వీరు ఉపయోగిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆయన దావాలో పేర్కొన్నారు.

law suit on modi and jagan
law suit on modi and jagan

Lawsuit On Modi Jagan : అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వ్యాపార దిగ్గజం గౌతమ్‌ అదానీపై ఓ భారతీయ అమెరికన్‌ వైద్యుడు దావా వేశారు. రాజకీయ ప్రత్యర్థులపై పెగసస్​ స్పైవేర్​ను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాజ్యంలో ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్​కు చెందిన డా.లోకేశ్​ ఉయ్యూరు.. అమెరికాలోని రిచ్​మండ్​లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్​గా పని చేస్తున్నారు. మే 24న ఆయన మోదీ, జగన్​, అదానీపై కోర్టులో దావా దాఖలు చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్​ స్క్వాబ్​ పేరును కూడా లోకేశ్ దావాలో​ ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై విచారణ కోసం కొలంబియా డిస్ట్రిక్ట్​ కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. మోదీ, జగన్​, అదానీకి ఆగస్టు 4న, స్విట్జర్లాండ్​లో ఉన్న క్లాస్​ స్క్వాబ్​కు ఆగస్టు 2న సమన్లు వెళ్లాయి.

అయితే న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ అటార్నీ జనరల్​ రవి బాత్రా దీనిని "డెడ్ ఆన్ అరైవల్ దావా"గా పేర్కొన్నారు. ఈ దావాపై సంతకం చేయడానికి న్యాయవాదులెవరూ అంగీకరించలేదని ఆయన చెప్పారు. డాక్టర్​ లోకేశ్ ఖాళీగా ఉన్నారని, అందుకే 53 పేజీల దావా వేశారని బాత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవీ చదవండి: వరద బాధితుల పడవ బోల్తా.. 20 మందికి పైగా..

ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.