ETV Bharat / international

టన్నెల్​లో పేలిన ఇంధన ట్యాంకర్​.. 19 మంది మృతి.. అనేక మందికి గాయాలు

author img

By

Published : Dec 18, 2022, 6:16 PM IST

explosion at tunnel in Afghanistan
అఫ్గానిస్థాన్​లోని సొరంగంలో పేలుడు

అఫ్గానిస్థాన్​లోని ఓ సొరంగ మార్గంలో ఇంధన ట్యాంకర్​ పేలి 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అఫ్గానిస్థాన్​లో ఘోరం జరిగింది. సొరంగ మార్గంలో ఇంధన ట్యాంకర్​ పేలి దాదాపు 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న సలాగ్​ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఈ ఘటన జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో ఇంధన ట్యాంకర్​ పేలింది. కొంత మంది శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయాయని, సొరంగాన్ని క్లియర్​ చేసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

"ప్రమాదానికి గురైనవారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంత మంది మాత్రం గుర్తుపట్టలేనంతగా గాయపడ్డారు" అని బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
కాబుల్​కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఈ సలాగ్ టన్నెల్​ ఉంటుంది. ఆ దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను ఇది కలుపుతుంది. సోవియట్​ యూనియన్​ సహాయంతో ఈ సొరంగ మార్గాన్ని 1960లో అఫ్గానిస్థాన్​ నిర్మించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.