ETV Bharat / international

'ఉక్రెయిన్​నే కాదు నల్ల జాతీయుల దేశాలనూ పట్టించుకోండి'

author img

By

Published : Apr 14, 2022, 7:00 AM IST

ukraine news
who news

WHO Director General: ఉక్రెయిన్​ యుద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం ఇతర సంక్షోభ దేశాలకు ఇవ్వడంలేదని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ టెడ్రోస్​ అధనోమ్​. ప్రపంచమంతా నల్లజాతీయులపై వివక్షను చూపుతోందన్నారు.

WHO Director General: ప్రపంచ సమాజమంతా నల్లజాతీయులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ టెడ్రోస్​ అధనోమ్​. ఉక్రెయిన్​ యుద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం.. ఇథియోపియా, యెమెన్​, అఫ్గానిస్థాన్​, సిరియా వంటి ఇతర సంక్షోభాలకు ప్రపంచ దేశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ దేశంలో బాధలు అనుభవిస్తున్నది శ్వేతజాతీయులు కాకపోవడమే ఇందుకు కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం నలుపు, శ్వేత జాతీయులు ఇద్దరిపై సమానంగానే శ్రద్ధ వహిస్తుందా అని ప్రశ్నించారు. బుధవారం జెనీవాలో జరిగిన వర్చువల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత నెలలో ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో భారీ సంక్షోభం సంభవించిందని.. లక్షల మంది ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందన్నారు. 2 వేల ట్రక్కుల ఆహారం, మందులు, నిత్యావసరాలు అవసరం ఉన్నా.. కేవలం 20 ట్రక్కులు మాత్రమే వచ్చాయని అధనోమ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న దురాగతాలను ప్రదర్శించడంలో మీడియా విఫలమైందని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​పై రష్యాది మారణకాండే'.. పుతిన్​పై బైడెన్ గరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.