ETV Bharat / international

మీరు ఒంటరి వాళ్లు కారు: బ్రిటన్​ రాణి

author img

By

Published : Dec 26, 2020, 10:20 PM IST

బ్రిటన్​ రాణి ఎలిజబెత్​2 క్రిస్మస్ సందేశాన్ని పంపించారు. కుంటుంబ సభ్యలు, స్నేహితులు లేకుండా ఈ సంవత్సరం పండుగలు జరుపుకున్న వాళ్లు ఒంటరి వారు కాదని అన్నారు.

You're not alone, says UK Queen in Xmas message
మీరు ఒంటరి వాళ్లు కారు: బ్రిటన్​ రాణి

కరోనా కారణంగా సన్నిహితులు లేకుండా ఈ సారి పండుగలను ఒంటరిగా జరుపుకోవాల్సి వచ్చిందని బాధపడిన వారు ఒంటరి వాళ్లు కారని బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ అన్నారు. ఈ మేరకు క్రిస్మస్ వీడియో సందేశాన్ని పంపించారు.

స్ఫూర్తి నింపిన దీపావళి

విండోర్స్​ లో జరిగిన దీపావళి పండుగను క్వీన్​ ఉదహరించారు. భౌతిక దూరంతో ఉన్నా మనందరిలో ఐక్యమత్యాన్ని , ఆశలను దీపావళి ప్రతిబింబించిందని గుర్తుచేశారు. క్రిస్మస్ కాంతులు అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు.

ఈ సంవత్సరం కరోనా భౌతికంగా ఎవరిని కలవకుండా దూరంగా ఉంచినా.. మానసికంగా దగ్గరయ్యేలా చేసిందని పేర్కొన్నారు. 2020 విసిరిన సవాళ్లను బ్రిటనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ధీటుగా ఎదర్కొన్నారని వ్యాఖ్యానించారు.

కరోనా పోరులో ముందుండి నడిచినవారు నిస్వార్థ సేవకులని కొనియాడారు. ఎలిజబెత్​ దంపతులు తమ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడకలలో పాల్గొనలేదు. బ్రిటన్​ రాజదంపతులు క్రిస్మస్ వేడుకలలో పాల్లొనకపోవడం 1980 తరువాత ఇదే మొదటిసారి.

ఇదీ చూడండి : ఎలిజబెత్​ మహారాణి ముద్దు పేరేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.