ETV Bharat / international

పేద దేశాలకు టీకా సాయం చేయాలని G-20 సదస్సులో పిలుపు

author img

By

Published : Oct 30, 2021, 2:55 PM IST

Updated : Oct 30, 2021, 10:57 PM IST

modi g20 summit
జీ 20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ

21:59 October 30

2022 చివరినాటికి భారత్​ 500 కోట్ల టికా డోసులను ఉత్పత్తి చేసి కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ-20 సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్ భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను కూడా మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్​ స్వదేశీ టీకా కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారని, ఈ టీకాకు వస్తే ఇతర దేశాలకు భారత్ మరింత చేయగలదని వివరించినట్లు పేర్కొన్నారు. కరోనా పాండెమిక్ సమయంలో 150 దేశాలు భారత్​ ఔషధాలు సరఫరా చేసిందని మోదీ గుర్తు చేశారన్నారు.  'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'​లో మోదీ ఈమేరకు మాట్లాడినట్లు చెప్పారు.

నిలకడగల ప్రపంచ సరఫరా గొలుసుల ఆవశ్యకతను నొక్కిచెప్పిన ప్రధాని మోదీ.. భారత్​ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి ఈ సెషన్​లో మాట్లాడారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్​ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని G20 దేశాలను ఆహ్వానించారు.

20:24 October 30

పేద దేశాలకు కరోనా టీకాలు అందించి బాసటగా నిలిచేందుకు G-20 దేశాలు ముందుకొచ్చాయి. బ్రిటన్​ తరఫున 20కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాల డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. రోమ్​లో జీ-20 సమావేశానికి ముందు ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే 10కోట్ల టీకా డోసులను ఐరాస చేపట్టిన కొవ్యాక్స్ కార్యక్రమానికి అందించినట్లు వెల్లడించారు. మరో 10 కోట్ల టీకాలను కూడా త్వరలోనే సరఫరా చేస్తామన్నారు. 2022 జూన్ నాటికి ఇతర దేశాలకు 100 మిలియన్ టీకాలు ఇవ్వాలనే సంకల్పానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

పేద దేశాలకు తమవంతు సాయంగా 67 మిలియన్ల టీకా డోసులను విరాళంగా ఇస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. అమెరికా తర్వాత కొవ్యాక్స్ కార్యక్రమానికి ఇంత భారీ మొత్తం టీకాలు ఇవ్వనున్న దేశంగా నిలిచింది. ఇప్పటికే ఆఫ్రికాలోని 30 దేశాలు సహా మొత్తం 45 దేశాలకు టీకాలు అందించినట్లు వెల్లడించింది. 2022 జూన్ నాటికి మరో 60 కోట్ల టీకా డోసుసలను సమకూర్చుతామని చెప్పింది. ఈమెరకు ఫ్రాన్స్ ఆరోగ్యమంత్రి జీన్​ వెస్​ లి డ్రియాన్​ జీ-20 సదస్సుకు ముందు ప్రకటించారు.

ప్రపంచంలోని పేద దేశాలకు కరోనా టీకాలు అందేలా చూడాలని జీ-20 సదస్సులో నిర్ణయించారు. సంపన్న దేశాల్లో 70శాతం మందికి టీకాలు అందగా.. పేద దేశాల్లో 3 శాతం మందికి కూడా టీకాలు చేరలేదని ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి అందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాలు కలసికట్టుగా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

19:36 October 30

G-20 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలకు సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ కనీస పన్నును 15శాతంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని G-20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి వెల్లడించారు. పారదర్శక, ప్రభావవంతమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. 

ఈ ఒప్పందంతో మల్టీ నేషనల్​ కంపెనీలు ఇక నుంచి 15శాతం పన్నును ఆయా దేశాలకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(OCED)  ఈనెల మొదట్లోనే అంతర్జాతీయ పన్ను సంస్కరణలను ఖరారు చేసింది. మల్టీ నేషనల్ కంపెనీల పన్ను రేటు 2023నుంచి 15శాతంగా ఉండాలని నిర్ణయించింది. ఈ ఒప్పందానికి 136 దేశాలు ఆమోదం తెలిపాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా దాదాపు 90 శాతం.

అంతర్జాతీయ కనీస పన్ను వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు ట్యాక్స్ భారం తప్పించుకునేందుకు ఉద్యోగాలు, లాభాలను ఇతర దేశాలకు తరలించడానికి వీలు ఉండదు. ఫలితంగా ఆయా దేశాలకు ట్యాక్స్ రూపంలో మరింత ఆదాయం సమకూరుతంది. ఒక్క అమెరికాకే ఈ ట్యాక్స్ ద్వారా 60 బిలయన్​ డాలర్ల ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.

17:35 October 30

జీ20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్​తో ముచ్చటించారు ప్రధాని మోదీ. వారితో కాసేపు ఆహ్లాదంగా గడిపారు.

16:53 October 30

జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి తొలిసెషన్​లో ప్రసంగించారు. ప్రపంచంలోని పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్​ అందేలా అందరూ కలసికట్టుగా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సంపన్న దేశాల్లో 70 మందికి కరోనా టీకా అందగా.. పేద దేశాల్లోని 3 శాతం మందికి కూడా టీకా చేరలేదని డ్రాఘి ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. బహుముఖ సహకారంతోనే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగలమన్నారు.

15:51 October 30

  • G20 Summit: PM Narendra Modi and other world leaders participate in session on 'Global Economy and Global Health (Working Lunch)' at Roma Convention Centre in Rome, Italy pic.twitter.com/gQg0uKpDRM

    — ANI (@ANI) October 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జీ20 సదస్సులో భాగంగా నిర్వహించిన 'గ్లోబల్ ఎకానమీ అండ్ గ్లోబల్ హెల్త్' సెషన్​లో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర సభ్య దేశాల అధినేతలు పాల్గొన్నారు.

15:27 October 30

  • G20 Summit: Frontline workers join PM Narendra Modi and other world leaders for 'family photo' at Roma Convention Center in Rome, Italy pic.twitter.com/rdyB0VRo8u

    — ANI (@ANI) October 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జీ20 శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతలు ఫ్యామిలీ ఫొటొ దిగారు. మోదీ పాటు ఇతర దేశాల నాయకులతో కలిసి ఇటలీ ఆరోగ్య కార్యకర్తలు ఫొటో దిగారు.

14:44 October 30

పేద దేశాలకు టీకా సాయం చేయాలని G-20 సదస్సులో పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటలీ రాజధాని రోమ్​లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు(g20 summit rome 2021) హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ.. మోదీకి(modi g20 summit ) సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ వేదికకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి ఈ సదస్సు భౌతికంగా జరుగుతోంది(g20 summit rome 2021).

ప్రపంచంలోని ఆర్థికంగా శక్తిమంతమైన 20 దేశాలు(g20 summit 2021) పాల్గొంటున్న ఈ సమావేశంలో ప్రధానంగా వాతావరణ మార్పు, కరోనా, కార్పొరేట్​ ట్యాక్స్​ అంశాలపై చర్చ జరగనుంది. శనివారం ప్రారంభ సెషన్​లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలను ముఖ్యంగా ప్రస్తావించనున్నారు. అనంతరం జరిగే కీలక సమావేశంలో ఇరాన్​ అణు కార్యకలపాల అంశంపై జీ-20 దేశాధినేతలు చర్చించనున్నారు.

Last Updated :Oct 30, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.