ETV Bharat / international

Panjshir Valley: 'పంజ్​షేర్​లోకి తాలిబన్లా? ఒక్కరూ అడుగుపెట్టలేదు!'

author img

By

Published : Aug 29, 2021, 10:17 AM IST

అఫ్గానిస్థాన్​లోని పంజ్​షేర్​లో(Panjshir valley) ఇప్పటివరకు ఒక్క తాలిబన్(Afghanistan Taliban)​ కూడా అడుగుపెట్టలేదని ప్రకటించింది అక్కడి తిరుగుబాటు దళం. తాలిబన్ల వ్యాఖ్యలు.. అసత్యాలని పేర్కొంది.

The resistance forces in the Panjshi
పంజ్​షేర్​ తాలిబన్లు, అహ్మద్​ మసూద్​

పంజ్​షేర్​ లోయలోకి (Panjshir valley) తమ బలగాలు ప్రవేశించాయన్న తాలిబన్ల(Afghanistan Taliban) వ్యాఖ్యలను తోసిపుచ్చింది అక్కడి తిరుగుబాటు దళం. తాలిబన్ల నుంచి ఏ ఒక్కరూ.. పంజ్​షేర్​ రాష్ట్రంలోకి ఇప్పటివరకు అడుగుపెట్టలేదని ప్రకటించారు అహ్మద్​ మసూద్​ మద్దతుదారులు. ఈ మేరకు అఫ్గానిస్థాన్​లోని ఓ టీవీ ఛానల్​కు వెల్లడించారు.

''పంజ్​షేర్​లో ఇప్పటివరకు ఎలాంటి పోరాటం జరగలేదు. ఈ రాష్ట్రంలోకి ఎవరూ అడుగుపెట్టలేదు.''

- మహ్మద్​ అమాస్​ జాహిద్​, తిరుగుబాటు ప్రతినిధి బృందం అధినేత

అంతకుముందు.. తమ బలగాలు పంజ్​షేర్​లోకి (Panjshir valley) ప్రవేశించాయని ప్రకటించారు తాలిబన్లు.

''యుద్ధం జరగలేదు. కానీ.. తాలిబన్లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. వివిధ మార్గాల నుంచి తాలిబన్​ దళాలు.. పంజ్​షేర్​లోకి ప్రవేశించాయి.''

- అనాముల్లా సమంఘాని, తాలిబన్​ సాంస్కృతిక కమిటీ సభ్యుడు

కాబుల్​ విమానాశ్రయం(Kabul Airport) సహా అఫ్గానిస్థాన్​లోని కీలక ప్రాంతాలను తమ వశం చేసుకున్న తాలిబన్లకు.. పంజ్​షేర్​ నుంచి సవాల్​ ఎదురైంది. దిగ్గజ మిలటరీ కమాండర్​ అహ్మద్​ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు అహ్మద్​ మసూద్​(Ahmad Massoud), అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కలిసి.. తాలిబన్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్​ పర్వత శ్రేణుల్లో ఉన్న పంజ్​షేర్​ అంటే తాలిబన్లకు ఎప్పటినుంచో వెన్నులో వణుకు. అందుకే.. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనే ముందు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

తాలిబన్లు, ఆల్‌ఖైదా ముష్కరులు (AL qaeda) కలిసి నకిలీ విలేకరుల వేషంలో.. ఆత్మాహుతి దాడి జరిపి 2001 సెప్టెంబర్‌ 9న అహ్మద్​ షా మసూద్​ను పొట్టనపెట్టుకున్నారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఆయన తనయుడు అహ్మద్​ మసూద్​.

ఇవీ చదవండి: Panjshir valley: 'పంజ్​షేర్'​ తాలిబన్లకు లొంగుతుందా?

Panjshir Valley: 'పంజ్​షేర్'లో నిశ్శబ్దం- తుపాను ముందు ప్రశాంతతా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.