ETV Bharat / international

Afghan Crisis: పంజ్​షేర్ తాలిబన్ల వశమైందా?

author img

By

Published : Sep 4, 2021, 8:33 AM IST

Updated : Sep 4, 2021, 11:29 AM IST

పంజ్‌షేర్‌ ఆక్రమణలో పురోగతి సాధించినట్లు తాలిబన్లు చెబుతున్న వార్తలను స్వయం ప్రకటిత అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తోసిపుచ్చారు. వాటిని తాలిబన్ ఎత్తుగడగా అభివర్ణించారు. తమ పోరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. పంజ్​షేర్​ను ఇంకా తాలిబన్లు ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు.

Saleh
Saleh

పంజ్‌షేర్‌లో తాలిబన్లకు(Afghan Taliban) వ్యతిరేకంగా పోరు కొనసాగుతుందని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్(Amrullah Saleh) ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'యుద్ధం ముగిసిపోలేదు.. నా మాతృభూమి కోసం అది కొనసాగుతోంది. నేను దాని గౌరవాన్ని కాపాడుతున్నా.' అని సలేహ్ శుక్రవారం ట్వీట్ చేశారు. అలాగే తాను పంజ్​షేర్​ను విడిచి పోయినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

saleh
అమ్రుల్లా సలేహ్ ట్వీట్
saleh
అమ్రుల్లా సలేహ్ వీడియో మెసేజ్

"నేను పంజ్‌షేర్‌లోనే ఉన్నా. తాలిబన్ వ్యతిరేక దళాలు, తాలిబన్​ ఫైటర్లు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అలాగే తాలిబన్లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. తాలిబన్ల అనాగరిక చర్యలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా."

-'టోలో న్యూస్​తో అమ్రుల్లా సలేహ్

యావత్​ దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిబన్లు(Taliban News) పంజ్​షేర్​ను హస్తగతం చేసుకునేందుకు భారీగా ఆయుధాలు, బలగాలతో వెళ్లారు. పంజ్​షేర్​ తమ వశం అవటం ఖాయంగా భావించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత బుధవారం బదక్షన్​లోని అంజుమాన్​ మార్గం ద్వారా తాలిబన్లు పంజ్​షేర్​లోకి(Punjshir Valley) ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఎన్​ఆర్​ఎఫ్​ దళాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దాంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

saleh
అమ్రుల్లా సలేహ్

మరోవైపు అఫ్గానిస్థాన్​లో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరదార్ నాయకత్వం వహిస్తారని స్థానిక మీడియా పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 4, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.