ETV Bharat / international

మయన్మార్ నిరసనకారులకు ఇకపై మరణ శిక్షలు!

author img

By

Published : Mar 17, 2021, 11:22 AM IST

మయన్మార్​లో నిరసనకారులపై సైన్యం కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే మరణ శిక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. కోర్ట్ మార్షల్ పరిధిలోకి వచ్చే నేరాల తీర్పులపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదని ప్రకటించింది.

myanmar junta imposes death penalty for treason dissent
మయన్మార్ నిరసనకారులకు ఇకపై మరణ శిక్షలు!

దేశంలో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువెత్తుతున్న నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న మయన్మార్ సైన్యం.. ఆందోళనకారులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. రాజద్రోహం, అసమ్మతి వెలిబుచ్చడం సహా ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే క్రూరమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. సుదీర్ఘ జైలు శిక్షలతో పాటు మరణశిక్షలూ అమలు చేస్తామని స్పష్టం చేసింది.

మొత్తం 23 రకాల నేరాలు కోర్ట్ మార్షల్ పరిధిలోకి వస్తాయని సైన్యం పేర్కొంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపింది. అయితే, మరణ శిక్షకు వ్యతిరేకంగా 15 రోజుల్లోగా.. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాయింగ్​కు అభ్యర్థన చేసుకోవచ్చని వెల్లడించింది.

మరోవైపు, యాంగూన్​లోని న్యాయస్థానాల నియంత్రణను తమ పరిధిలోకి తీసుకోనున్నట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించిందని స్థానిక వార్తా సంస్థ 'క్యోడో న్యూస్' తెలిపింది. తాజా చర్యలు అంతర్జాతీయంగా మరింత విమర్శలకు దారితీస్తాయని పేర్కొంది.

149 మంది మృతి

అంతకుముందు, మయన్మార్ సైనిక హింసాకాండలో 149 మంది మరణించారని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ ప్రతినిధి రవీనా శందాసని తెలిపారు. 2,084 మందికి పైగా నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. ఇటీవల ఐదుగురు కస్టడీలో మరణించారని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.