ETV Bharat / international

హిందూ మహాసముద్రంలో మునిగిన ఓడ- 17మంది మృతి

author img

By

Published : Dec 21, 2021, 7:37 AM IST

Madagascar ship sinking: 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 68 మంది గల్లంతయ్యారు.

Madagascar ship sinking
Madagascar ship sinking

Madagascar ship sinking: మడగాస్కర్‌ ఈశాన్య తిరంలో సోమవారం తెల్లవారుజామున 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 68 మంది గల్లంతయ్యారు. మిగిలిన 45 మందిని తీర రక్షక అధికారులు కాపాడారు.

మనానరా నార్త్‌ జిల్లాలోని అంటానంబె నగరం నుంచి సొవానియెరనా ఇవోంగో ఓడరేవుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నౌక అడుగు భాగానికి రంధ్రం కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం.. 375కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.