ETV Bharat / international

ఆ దేశంపై డెల్టా దెబ్బ- కేసుల్లో ఆసియాలోనే టాప్​!

author img

By

Published : Jul 14, 2021, 6:13 PM IST

covid, indonesia
కొవిడ్, ఇండోనేషియా

ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదుకావడం వల్ల ఇండోనేషియా.. ఆసియాలోనే వైరస్​ హాట్​స్పాట్​గా మారింది. రోజువారీ కేసుల సంఖ్యలో భారత్​ను అధిగమించింది.

ఇండోనేషియాలో కొవిడ్​ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఏకంగా 54,000 మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. దీంతో.. రోజూవారీ కేసుల సంఖ్యలో భారత్​ను అధిగమించి.. ఆసియాలో వైరస్​ హాట్​స్పాట్​గా మారింది ఇండోనేషియా.

ఈ నేపథ్యంలో.. జావా, బాలి దీవుల్లో డెల్టా వేరియంట్​ వ్యాప్తి తీవ్రమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్​డౌన్ తరహా ఆంక్షలు విధించి.. పార్కులు, మాల్స్, రెస్టారెంట్లు మూసివేసినట్లు పేర్కొన్నారు.

"జులైలో కొవిడ్​ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది. వైరస్​ వ్యాప్తిని ఇప్పటికీ అదుపు చేయలేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఉన్న ఆంక్షలు మరింత కఠినతరం చేయాలి. డెల్టా వేరియంట్​ రెండింతలు వేగంగా వ్యాపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకోవాలి."

--పండు రైనో, ఇండోనేషియా విశ్వవిద్యాలయ అంటువ్యాధుల నిపుణుడు.

ఇండోనేషియాలో బుధవారం కొత్తగా 54, 517 కేసులు నమోదవడం వల్ల .. మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలకు పెరిగింది. 991 మంది వైరస్​కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 69,000 దాటిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'డెల్టా వ్యాప్తితో ప్రపంచానికి పెను ముప్పు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.