ETV Bharat / international

'జలాంతర్గామిలోని 53 మంది జలసమాధి!'

author img

By

Published : Apr 24, 2021, 3:10 PM IST

Updated : Apr 25, 2021, 11:07 AM IST

ఇండోనేసియా జలాంతర్గామికి చెందిన పలు వస్తువులు లభించినట్లు ఆ దేశ నౌకాదళం వెల్లడించింది. వాటి ఆధారంగా నౌక మునిగిపోయినట్లు భావిస్తున్నామని తెలిపింది.

Indonesia navy
ఇండోనేసియా జలాంతర్గామి శకలాలు లభ్యం

హిందూ మహాసముద్రంలో గల్లంతైన జలాంతర్గామికి చెందిన పలు శకలాలు లభ్యమైనట్లు ఇండోనేసియా నౌకాదళం తెలిపింది. 53 మంది సిబ్బందితో ఈనెల 21న బాలి ద్వీపానికి సమీపంలో గల్లంతైన క్రమంలో గాలింపు చర్యలు చేపట్టింది నౌకాదళం.

జలాంతర్గామివిగా భావిస్తున్న టర్పెడో స్ట్రేయ్​ట్నర్​, ఓ గ్రీజ్​ బాటిల్​లను సహాయక బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు నౌకాదళ చీఫ్​ అడ్మిరల్​ యుడో మార్గోనో తెలిపారు.

"జలాంతర్గామికి చెందినవిగా భావిస్తున్న ప్రామాణిక ఆధారాలతో సబ్​మెరైన్​ మునిగిపోయినట్లు భావిస్తున్నాం. "

- యుడో మార్గోనో, నౌకాదళ చీఫ్​

ఇప్పటి వరకు జలాంతర్గామి గల్లంతైందని భావిస్తోన్న ఇండోనేషియా నౌక.. మునిగిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించింది ఆ దేశ నౌకాదళం. అందులోని సిబ్బంది ఎవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనుకోవటం లేదని పేర్కొంది. ఆక్సిజన్​ కూడా శనివారం ఉదయానికి అయిపోయి ఉంటుందని తెలిపింది.

ఆచూకీ గల్లంతైన జలాంతర్గామి కోసం సింగపూర్​, ఆస్ట్రేలియాలతో పాటు భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది.

ఇవీ చూడండి: 53 మందితో ఇండోనేసియా జలాంతర్గామి గల్లంతు

జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్

Last Updated :Apr 25, 2021, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.