ETV Bharat / international

విలయం సృష్టిస్తున్న వరదలు- 16 మంది మృతి

author img

By

Published : Jun 19, 2021, 2:59 PM IST

కుండపోతగా కురుస్తున్న వర్షాలు నేపాల్​ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 16 మృతి చెందారు. మరో 22 మంది గల్లంతయ్యారు.

nepal floods
నేపాల్​లో వరదలు

నేపాల్​లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మనాంగ్​, సింధుపాల్‌ చౌక్‌లో వరదల ధాటికి ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. మరో 22 మంది గల్లంతయ్యారు.

వర్షాల ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి వివిధ పట్టణాలు.. బురదతో నిండిపోయాయి. సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని నేపాల్​ సైన్యం తమ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇదీ చూడండి: బస్సు ప్రమాదంలో 27 మంది దుర్మరణం

ఇదీ చూడండి: కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.