ETV Bharat / international

సరిహద్దులో సైనికుల పోరాటం భేష్.. సీపీసీ కితాబు

author img

By

Published : Nov 18, 2021, 5:57 AM IST

చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) తమ దేశ సైనికులను ప్రశంసించింది. వాస్తవాధీనరేఖ వెంట భారత్‌తో(China army at Indian border) ఉద్రిక్తతల దృష్ట్యా సరిహద్దులో భారీగా కార్యకలాపాలు చేపట్టడం, పోరాట ప్రతిమను కనబరచడంపై పీఎల్​ఏను కొనియాడింది సీపీసీ​.

CPC
సీపీసీ

చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీని(పీఎల్ఏ) చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) ప్రశంసించింది. వాస్తవాధీనరేఖ వెంబడి భారత్‌తో సరిహద్దు (China army at Indian border) ఘర్షణలు ఉన్న నేపథ్యంలో సరిహద్దులో భారీ ఆపరేషన్​లు చేపట్టడం, పోరాట ప్రతిమను కనబరచడంపై పీఎల్​ఏను కొనియాడింది సీపీసీ.

కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ చైనా(China CPC meeting) ఆధ్వర్యంలో.. గతవారం నిర్వహించిన ఉన్నతస్థాయి కాంక్లేవ్​లో.. చారిత్రక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో గడచిన 100ఏళ్లలో సాధించిన విజయాలపైనా తీర్మానంలో పేర్కొంది. అంతేకాక ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​కు మూడోసారి పగ్గాలు అందించాలని నిర్ణయించింది.

మంగళవారం రాత్రి విడుదల చేసిన ఈ తీర్మానంలో(China CPC meeting) జిన్​పింగ్​ సేవలు, 20లక్షలకుపైగా ఉన్న చైనా సైనిక సిబ్బందిని శక్తిమంతంగా తయారుచేయటం.. తదితర వివరాలు ఉన్నాయి.

బయటి శక్తులను తిప్పికొట్టేవిధంగా.. చైనా ఆర్మీ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో ఉంది. వాస్తవాధీనరేఖ వెంబడి భారత్‌తో సరిహద్దు (China army at Indian border) ఘర్షణలు ఉన్న నేపథ్యంలో సరిహద్దులో భారీస్థాయిలో కార్యకలాపాలు చేపట్టడాన్ని ప్రస్తావించింది. 2027 నాటికి తమలక్ష్యాలను అధిగమించాలని తీర్మానించింది. 2035నాటికి ఆధునిక పద్ధతిలో ఆర్మీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జిన్​పింగ్ అధికారంలోకి వచ్చాక.. చైనా రక్షణరంగం బలోపేతం అయింది. దేశ బడ్జెట్​లో రక్షణరంగానికి అధిక బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చారు. ఈ ఏడాది చైనా రక్షణరంగానికి కేటాయించిన బడ్జెట్ 200బిలియన్​డాలర్లు దాటింది.

ఇదీ చూడండి: 'అంగుళం భూమినీ ఆక్రమించుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.