ETV Bharat / international

'మా జవాను త్వరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం'

author img

By

Published : Oct 20, 2020, 12:13 PM IST

తమ దేశ జవానును భారత్​ సైన్యం త్వరగా విడుదల చేస్తుందని చైనా ఆర్మీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే భారత్​ను సంప్రదించినట్టు పేర్కొంది.

china-hopes-its-missing-soldier-held-by-indian-army-will-be-released-soon
'మా జవాను త్వరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం'

భారత్​ అధీనంలో ఉన్న తమ జవాను.. త్వరగా విడుదలవుతాడని చైనా సైన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే భారత్​తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.

"ఈ నెల 18న చైనా-భారత్​ సరిహద్దు ప్రాంతంలో గల్లంతైన జవాను ప్రస్తుతం భారత్​ అధీనంలో ఉన్నాడు. స్థానికుల అభ్యర్థన మేరకు వారి జడల బర్రెను తిరిగి తీసుకొచ్చే క్రమంలో జవాను గల్లంతయ్యాడు. అందువల్ల మా దేశ సైనికుడిని భారత్​ త్వరగా విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం."

-- కల్నల్​ జాంగ్​ షుయిలి, పీఎల్​ఏ కమాండర్​.

ఈ పూర్తి వ్యవహారంపై సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది భారత సైన్యం. తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌ వద్ద కార్పరల్‌ స్థాయి చైనా సైనికుడైన వాంగ్‌ యా లాంగ్‌ను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అతని వద్ద పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఆ సైనికుడు గూఢచారిగా భారత్‌కు వచ్చాడా? లేక మరే ప్రణాళికతోనైనా వచ్చాడా? అన్న అంశంపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం ప్రోటోకాల్‌ ప్రకారం సైనికుడిని చైనాకు అప్పగించనున్నట్టు వివరించింది.

ఇదీ చూడండి:- కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.