ETV Bharat / international

అరుణాచల్​ప్రదేశ్​ సమీపంలో చైనా 'రహదారి'

author img

By

Published : May 20, 2021, 10:31 PM IST

china-Brahmaputra
భారత​ సరిహద్దుల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసిన చైనా

భారత్​లోని అరుణాచల్​ప్రదేశ్​ సరిహద్దుకు దగ్గరగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది చైనా. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న రహదారిగా చైనా అభివర్ణించింది.

భారత్​లోని అరుణాచల్​ప్రదేశ్​కు సమీపంలో, టిబెట్​లోని బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్​ నిర్మించేందుకు చైనా వేసిన ప్రణాళికలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనులను చైనా పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న రహదారిగా అభివర్ణించింది.

6,009 మీటర్ల గరిష్ట లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన యార్లుంగ్ జాంగ్​బో గ్రాండ్ లోయ వెంబడి.. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన రహదారి గత శనివారం పూర్తయినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. న్యిన్​గ్చి, మెడాగ్​ను జోడిస్తూ జరిగిన 67.22 కిలోమీటర్ల నిర్మాణంతో రహదారి పనులు ముగిసినట్టు తెలిపింది. అరుణాచల్​ ప్రదేశ్​కు సమీపంగా, టిబెట్​లోని చివరి కౌంటి ఈ మెడాగ్​ కావడం గమనార్హం.

సుమారు 2 బిలియన్ యువాన్ల పెట్టుబడితో ఈ హైవే ప్రాజెక్టును 2014లో ప్రారంభించింది చైనా. అరుణాచల్​ ప్రదేశ్​ని టిబెట్​లో భాగంగా చెబుతూ వస్తోన్న చైనా.. భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా.. బ్రహ్మపుత్ర లోయ మీద నిర్మించే మెగా డ్యామ్ ప్రణాళికకు ఆమోద ముద్ర వేసుకుంది.

ఇవీ చదవండి: వీడని వూహాన్ ల్యాబ్ మిస్టరీ!

చైనాలో మతపరమైన వివక్షపై అమెరికా ఫైర్

'చైనా అంతరిక్ష కేంద్రం ప్రయోగం వాయిదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.