ETV Bharat / international

భారత​ సరిహద్దులో చైనా బలగాలకు కొత్త కమాండర్​

author img

By

Published : Sep 7, 2021, 1:19 PM IST

China appoints new army commander to head troops along Indian border
భారత​ సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలకు కొత్త కమాండర్​

భారత సరిహద్దు ప్రాంతంలోని(India China Border) తమ బలగాలకు కొత్త కమాండర్​ను నియమించింది చైనా. మరో నలుగురు సైనిక అధికారులకు కూడా పదోన్నతి కల్పించింది. చైనా మిలిటరీ అధికారిక వెబ్​సైట్​ ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత్​తో సరిహద్దు ప్రాంతంలో(India China Border) తమ బలగాలకు కొత్త సారథిగా జనరల్ వాంగ్ హైజియాంగ్​ను నియమించింది చైనా. పీఎల్​ఏ(People's Liberation Army) వెస్టర్న్​ థియేటర్ కమాండ్ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. మరో నలుగురు సీనియర్​ మిలిటరీ అధికారులకు కూడా సైన్యం అత్తున్నత హోదా జనరల్​గా పదోన్నతి కల్పించింది. బిజింగ్​లో సోమవారం జరిగిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్(xi jinping) వీరికి నియామక పత్రాలు అందజేశారు. చైనా మిలిటరీ అధికారిక వెబ్​సైట్​ ఈ విషయాన్ని వెల్లడించింది.

China appoints new army commander to head troops along Indian border
భారత​ సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలకు కొత్త కమాండర్​

షిన్​జియాంగ్​ ప్రాంతంతో పాటు టిబెట్ స్వయంపాలిత ప్రాంతాలు, భారత్​తో సరిహద్దు ప్రాంతాల భద్రతను చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తుంది. చైనా ఆర్మీ పర్యవేక్షించే అతిపెద్ద భౌగోళిక ప్రాంతం కూడా ఇదే.

గతేడాది మే నెలలో భారత్​-చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలు(India China Border Dispute) తలెత్తాయి. అప్పటి నుంచి వెస్టర్న్​ థియేటర్ కమాండ్​కు సారథులను మార్చడం ఇది నాలుగోసారి.

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు పరస్పర అంగీకారంలో భాగంగా గల్వాన్ లోయ, పాంగాంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్​, చైనా. అయితే తూర్పు లద్దాఖ్​లో ఫ్రిక్షన్ పాయింట్లయిన హాట్ స్ప్రింగ్స్​, దేప్సాంగ్​ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

ఇదీ చదవండి: Afghan Crisis: మీడియాకు తాలిబన్ల వార్నింగ్​- 'మసూద్' వార్తలపై నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.