ETV Bharat / international

భారత్​లో చిన్నారులకు తీవ్ర ముప్పు- అదే కారణం!

author img

By

Published : Aug 21, 2021, 6:56 PM IST

తుపానులు, వడగాలుల వంటి ప్రకృతి విపత్తులతో భారత్​లో చిన్నారులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని యూనిసెఫె వెల్లడించింది. ఈ మేరకు పర్యావరణ మార్పులతో అధిక ప్రభావానికి గురయ్యే దేశాలకు ర్యాంకులను కేటాయించింది.

CLIMATE CHANGE
వాతావరణ మార్పులు

భారత్‌ సహా నాలుగు ఆసియా దేశాలకు చెందిన చిన్నారులకు.. వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పు పొంచి ఉందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. ఈ మేరకు చిల్డ్రన్స్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌-సీసీఆర్​ఐ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. పర్యావరణ మార్పులతో అధిక ప్రభావానికి గురయ్యే దేశాలకు ర్యాంకులను కేటాయించింది.

తుపానులు, వడగాలులు వంటి ప్రకృతి పరమైన విపత్తులు చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశముందని.. యూనిసెఫ్‌ ‌అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆసియాలోని భారత్‌ సహా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లోని చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తన నివేదికలో హెచ్చరించింది.

వరదలు, గాలి కాలుష్యం, పర్యావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉన్న ప్రపంచంలోని 33 దేశాల్లో.. భారత్‌ ఒకటిగా ఉందని యూనిసెఫ్‌ వెల్లడించింది. ఈ మార్పులు చిన్నారులు, మహిళలపై.. అధిక ప్రభావం చూపించే అవకాశముందని ఉందని అంచనా వేసింది.

ఇదీ చూడండి: చిన్నారుల కోసం యూనిసెఫ్​- ఫేస్​బుక్​ జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.