ETV Bharat / international

విహారి: ప్రకృతితో ప్రయాణం ఇలా ఉంటుంది!

author img

By

Published : Jul 15, 2019, 12:59 PM IST

పర్యావరణ పరిరక్షణలో అంగ్​కోర్​ పర్యటకులు

కాంబోడియాలోని అంగ్​కోర్​వాట్​ దేవాలయం పర్యటక ప్రాంతంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయానికి వెళ్లే పర్యటకులు భిన్నంగా తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఒకరు బైక్​రైడ్​తో స్థానికులను కలవాలని, మరొకరు కాలుష్యాన్ని నియంత్రించే విధంగా స్ఫూర్తినివ్వాలని!

పర్యావరణ పరిరక్షణలో అంగ్​కోర్​ పర్యటకులు

అంగ్​కోర్​​వాట్ దేవాలయం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన పర్యటక ప్రాంతాల్లో ఒకటి. కాంబోడియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుత శిల్పకళా నైపుణ్యం పర్యటకులను ఆకట్టుకుంటుంది.

కొంతమంది పర్యటకులు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు కాస్త విభిన్న పద్దతులను ఎంచుకున్నారు. కొందరు మోటార్​ బైకులు రైడ్​ చేస్తూ, స్థానికులతో మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో పర్యటక రంగం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలియజేస్తుంటారు.

బైక్​పై ప్రయాణించడం వల్ల చుట్టూ ఉన్న జనాలతో మాట్లాడొచ్చు. నేను మిగతా పర్యటకుల్లా చేయాలనుకోవట్లేదు. బస్సులో ప్రయాణిస్తే నాకు నచ్చిన చోట నేను దిగలేను. అందుకే నేను బైక్​ రైడ్​ను ఎంచుకున్నాను.

-బెక్కా షాడోన్​,అమెరికా టూరిస్టు

కాలుష్యరహితంగా ప్రయాణం:

పర్యావరణాన్ని రక్షించడానికి ఇంకొకరు ఇక్కడ ఎలక్ట్రిక్​ కారులో ప్రయాణిస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ విధంగా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్నట్లు బొలెరో బ్లూ సొల్యూషన్స్​ మేనేజర్​ హాంగ్​ సెంగ్​ మెంగ్​ తెలిపారు.

ఆలయ సమీపంలోని రెస్టారెంట్లలో ఒకటి ట్రీలైన్​ అర్బన్​ రిసార్ట్​. ఎటువంటి ప్లాస్టిక్​ వినియోగించకుండా వచ్చే అతిథులకు షేవింగ్​ కిట్​ మొదలు స్ట్రా వరకు అన్నీ కొయ్యతో చేసినవి అందిస్తారు. వారికి వచ్చే లాభాలను ఎగ్​బోక్​ కలినరీ స్కూల్​కు విరాళంగా ఇస్తున్నారు. వాటి సాయంతో యువకులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకునే వీలు కల్పించామని రెస్టారెంట్​ నిర్వహకుడు, పెంగ్​ సోఖీన్​ వివరించారు.

దీర్ఘకాలిక ప్లాస్టిక్​ కాలుష్యంతో ప్రభావితమైన కాంబోడియాను ప్లాస్టిక్​ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించింది జయా హౌస్​ రివర్​ పార్కు. వచ్చే అతిథులకు స్కానింగ్ చేయగల క్యూఆర్​ కోడ్​తో కూడిన వాటర్​ బాటిల్స్ ఇస్తారు. నీరు కావాల్సినప్పుడు ఈ కోడ్​ స్కాన్​ చేసి దగ్గరలోని నీరు లభించే ప్రదేశాన్ని తెలుపుతుంది.

ఇదీ చూడండి:రూ.200 కోసం కెన్యా నుంచి భారత్​కు..!


New Delhi, July 15 (ANI): Risking their lives, farmers in Mungeshpur village in Delhi are using toxic water coming from Mungeshpur drain, one of the longest in north-west Delhi and part of Najafgarh basin, for growing vegetables due to lack of groundwater for farming and to save money spent on buying fertilisers and urea. The water flowing from this channel has become completely poisonous due to the presence of industrial effluents in it. On speaking on the growing cases of cancer in the area Dr Ajay Dabas said, "We're running a cancer awareness campaign. In last 6 months, we found 10-12 fresh cases of cancer, here. We got to know that water from a dirty drain is being used to grow vegetables. It might be a cause of cancer."


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.