ETV Bharat / international

'తాలిబన్లు చంపేసినా ఆ విషయంలో వెనక్కి తగ్గం'

author img

By

Published : Aug 25, 2021, 5:33 PM IST

taliban woman education teachers reax
తాలిబన్

తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​లో(taliban afghanistan news) ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబన్ల పాలనపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ సమయంలో అక్కడి ఉపాధ్యాయులు ఓ అంశంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే తమ ప్రాణాలు ధారపోస్తామని అంటున్నారు.

తాలిబన్లు చంపేసినా సరే వెనక్కి తగ్గబోమని, బాలికల విద్య కోసం కృషి చేస్తూనే ఉంటామని అఫ్గానిస్థాన్ ఉపాధ్యాయులు తేల్చి చెబుతున్నారు. తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించుకొని(taliban news) కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలోని అధ్యాపకులు ఈ మేరకు వ్యాఖ్యానించారు. బాలికా విద్య కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని చెప్పారు. అంతేగానీ తమ పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.

యూకే టెలిగ్రాఫ్ వార్తా సంస్థతో మాట్లాడిన కాందహార్ రాష్ట్రానికి చెందిన ఓ టీచర్.. తాలిబన్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే.. తన విధి నిర్వహణను పక్కనపెట్టేది లేదని స్పష్టం చేశారు. 'నా పని పట్ల నేను గర్వపడుతున్నా. నా జీవితాన్ని బలితీసుకున్నా సరే ఈ పని ఆపను,' అని చెప్పారు. అఫ్గాన్​లో ఓ స్వచ్ఛంద సంస్థ తరపున ఈయన పనిచేస్తున్నారు. 13 వెనకబడిన రాష్ట్రాల్లో 100 పాఠశాలలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

పొంతన లేని చేష్టలు!

మహిళల హక్కులను గౌరవిస్తామని దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్​లో తాలిబన్లు(taliban press conference) స్పష్టం చేశారు. కానీ వారు ఇచ్చిన హామీకి, చేస్తున్న పనులకు పొంతన లేదని తెలుస్తోంది.

హెరాత్​ రాష్ట్రంలో ఇప్పటికే కో-ఎడ్యుకేషన్ నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థినులకు మహిళా టీచర్లే బోధించాలన్న షరతు విధించారని వార్తా సంస్థలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

'ఎంతమంది ఉగ్రవాదులను బైడెన్ తీసుకొస్తారో'

'ఉగ్రవాదులకు అఫ్గాన్‌ ఆశ్రయం ఇవ్వొద్దు'

కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్​ రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.