ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం

author img

By

Published : Mar 9, 2020, 3:16 PM IST

పాకిస్థాన్​లో జరిగిన ఓ ఘోర రోడ్డుప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

19 killed in road accident in Pakistan
పాక్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. 19మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

రావల్పిండి నుంచి 25మంది ప్రయాణికులతో స్కర్దుకు వెళ్తున్న బస్సు గిల్గిట్​ సమీపంలోని రువాండూ వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని గిల్గిట్​ బాల్టిస్థాన్​​ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫిరాక్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'మోదీ' బంగ్లాదేశ్​ పర్యటన రద్దు.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.