ETV Bharat / international

బస్సు బోల్తా- 15 మంది మృతి

author img

By

Published : Feb 2, 2021, 4:58 PM IST

పాకిస్థాన్​లో బస్సు బోల్తాపడి 15 మంది మరణించారు. మరో 10మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అధికారులు.

15 killed in bus accident in Pakistan
బస్సు బోల్తా- 15మంది మృతి

పాకిస్థాన్​ బలూచిస్థాన్​ రాష్ట్రంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి 15 మంది మృతి చెందారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించినవారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

బలూచిస్థాన్​ నుంచి కరాచీ వెళ్తున్న బస్సు అదుపు తప్పి క్వెట్టా-కరాచీ రహదారిపై ఉతల్ టౌన్​ వద్ద ప్రమాదానికి గురైంది.​ సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: మంచు తుపాను బీభత్సం- వణుకుతోన్న అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.