ETV Bharat / international

చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు- భారత్​ జాగ్రత్త!

author img

By

Published : Oct 22, 2021, 7:00 AM IST

made in china toys
చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు

కొన్ని మేడ్​-ఇన్​-చైనా బొమ్మలపై(made in china toys) ప్రమాదకర రసాయనాలు కోటింగ్​ చేసినట్టు అమెరికా అధికారులు గుర్తించారు(us china news). అనంతరం వాటిని జప్తు చేశారు. కాగా.. ఈ తరహా బొమ్మలు భారత్​లోనూ ఎక్కువగా లభిస్తుండటం, పిల్లల కోసం తల్లిదండ్రులు వాటిని అధికంగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం(india china news).

అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను(made in china toys) అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించామని వివరించారు(us china news). ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం(india china news).

ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్​ సీబీపీ(కస్టమ్స్​ అండ్​ బార్డర్​ ప్రొటక్షన్​) హెచ్చరించింది. బొమ్మలను భారీ మొత్తంలోని లీడ్​, కాడ్​మియమ్​, బేరియమ్​ కోటింగ్​లు కనపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

బొమ్మలను ఈ ఏడాది జులై 16న సీబీపీ అధికారులు, సీపీఎస్​సీ(కన్జ్యూమర్​ ప్రోడక్ట్స్​ సేఫ్టీ కమిషన్​) తనిఖీలు చేశారు. మొత్తం 7 బాక్సుల్లో చైనా నుంచి బొమ్మలు వచ్చాయి. వీటిల్లో చాలా వరకు భారత దేశంలోనూ అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఆగస్టు 24న బొమ్మలను ల్యాబ్​కు పంపించారు. అక్కడే బొమ్మల్లో ప్రమాదకర రసాయనాల కోటింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్​ 4న వాటిని అధికారులు సీజ్​ చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.