చైనాలో జరిగే 2022 శీతాకాల ఒలింపిక్స్ను అమెరికా బహిష్కరించాలంటూ పలువురు రిపబ్లికన్ నేతలు డిమాండ్ చేశారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. డిమాండ్ చేసిన వారిలో రిపబ్లికన్ ముఖ్యనేత ఇండో అమెరికన్ నిక్కీ హేలీ కూడా ఉన్నారు.
శీతాకాల ఒలింపిక్స్ను కమ్యూనిస్ట్ అజెండా ప్రచారానికి డ్రాగన్ వాడుకుంటుందని నిక్కీ హేలీ ఆరోపించారు. వింటర్ ఒలింపిక్స్ మాటున మానవహక్కుల ఉల్లంఘనను చైనా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇదంతా చూస్తూ కూర్చోలేమన్న హేలీ.. శీతాకాల ఒలింపిక్స్ను అమెరికా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ.. శీతాకాల ఒలింపిక్స్ నిర్వహణ కోసం మరో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కోరారు. అయితే రిపబ్లికన్ నేతల డిమాండ్లపై శ్వేతసౌధం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇదీ చూడండి: భారత్కు అమెరికా 216 బిలియన్ డాలర్ల బాకీ