ETV Bharat / international

చిన్నారుల్ని బలిగొన్న 'డ్రోన్​ దాడి'పై అమెరికా సమీక్ష

author img

By

Published : Sep 21, 2021, 12:39 PM IST

us drone strikes
అమెరికా డ్రోన్​ దాడులు

కాబుల్​లో అమెరికా జరిపిన డ్రోన్​ దాడిలో(us drone strike afghanistan) అమాయకులు మరిణించారని తేలగా.. ఇప్పటికే అగ్రరాజ్యం క్షమాపణలు చెప్పింది. తాజాగా.. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమీక్షకు ఆదేశించారు ఆ దేశ రక్షణమంత్రి. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడంపై నిర్ణయం తీసుకోనున్నారు..

అఫ్గాన్ నుంచి బయటకు వచ్చే ముందు కాబుల్​లో రెండుసార్లు డ్రోన్ దాడులు (US drone strike) నిర్వహించింది అమెరికా. ఈ దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. అయితే ఆగస్టు 29న జరిపిన దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 10మంది అఫ్గాన్​ పౌరులు మరణించారని దర్యాప్తులో తేలింది. చివరకు ప్రజలకు అమెరికా క్షమాపణలు చెప్పుకుంది(us military drone strike). అయితే ఈ వ్యవహారాన్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తుపై ఉన్నతస్థాయి సమీక్షకు ఆదేశించారు అగ్రరాజ్య రక్షణమంత్రి లాయిడ్​ ఆస్టిన్​.

బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ఈ సమీక్షలో నిర్ణయిస్తారు. ఘటనకు గల కారణాలపై జరిగిన సెంట్రల్​ కమాండ్​ ఇన్​వెస్టిగేషన్​పై సమీక్షకు ఉన్నతాధికారిని నియమించాలని అగ్రరాజ్య వాయుసేనకు ఆదేశాలిచ్చారు ఆస్టిన్​.

ఇదీ చూడండి:- US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా!

గత నెలలో.. అమెరికా సైన్యం వెనుదిరగకముందే మెరుపువేగంతో అఫ్గాన్​ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. దేశంలో సంక్షోభంలోకి జారుకుంది. ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబుల్​ విమానాశ్రయానికి(us kabul news) పరుగులు తీశారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా ఐసిస్​-కే ఉగ్రదాడులకు తెగబడింది. కొన్ని రోజుల తర్వాత.. ఐసిస్​-కే కీలక స్థావరాల్లో ప్రతీకార దాడులు చేసింది అమెరికా. అనంతరం అదే కాబుల్​ విమానాశ్రయం వద్ద రాకెట్​ దాడులు చేసింది. ఉగ్రకుట్ర భగ్నం చేసినట్టు.. ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ప్రకటించింది. కానీ ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

అఫ్గాన్​ను వీడిన 6.3లక్షల మంది..

హింస కారణంగా ఈ ఒక్క ఏడాదిలోనే అఫ్గాన్​లోని 6,35,000మంది ప్రజలు సొంత ఇళ్లను వదులుకోవాల్సిన వరిస్థితి ఏర్పడిందని ఓసీహెచ్​ఏ(యూఎన్​ ఆఫీస్​ ఫర్​ ది కొఆర్డినేషన్​ ఆఫ్​ హ్యుమానిటేరియన్​ అఫైర్స్​) వెల్లడించింది. గత నెలలో ఒక్క పంజ్​షేర్​ రాష్ట్రం నుంచే 12వేల మంది కాబుల్​కు వలస వెళ్లినట్టు పేర్కొంది. ఇప్పటివరకు 80లక్షల మందికి సహాయం చేసినట్టు స్పష్టం చేసింది. కాబుల్​లోని మరో 1,300మందికి సహాయం అందాలని తెలిపింది. మైదాన్​ వర్దాక్​ రాష్ట్రంలో 63వేల మందికి సహాయం అందాలని పేర్కొంది.

భారత్​ పాత్ర కీలకం..

ఈ వారంలో అమెరికాలో భారత ప్రధాని మోదీ- అధ్యక్షుడు బైడెన్​ భేటీ కానున్నారు(modi us visit 2021). అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో భారత్​తో కలిసి పనిచేయాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హయాంలో జాతీయ భద్రతా అధికారిగా సేవలు చేసిన లీసా కార్టిస్​ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్​లో ఉగ్రవాద నిరోధక చర్యలు, పాకిస్థాన్​ విషయంలో భారత్​తో కలిగట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:- తాలిబన్ల​ గుండెల్లో 'ఇస్లామిక్​ స్టేట్​' గుబులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.