ETV Bharat / international

చేతిలో చెయ్యేసి... నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి

author img

By

Published : Sep 28, 2021, 4:53 PM IST

ఆయన వయస్సు 59.. ఆమె వయస్సు 66. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. కానీ అనుకోని విధంగా కొవిడ్​ వీరి జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇద్దరూ ఒకేసారి ఆసుపత్రిలో చేరారు. చేతిలో చెయ్యి వేసుకుని ఒక్క నిమిషం వ్యవధిలో దంపతులు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన అమెరికా మిషిగన్​లో జరిగింది.

married-michigan-couple
దంపతులు

అమెరికా మిషిగన్​లో.. కాల్​ డన్హమ్​(59), లిండా(66).. ఈ నెల తొలి వారంలో అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ.. కుటుంబంతో కలిసి ట్రిప్​కు వెళ్లారు. అక్కడ వారికి జ్వరం, జలుబు తీవ్రమైంది. మూడు రోజులకే ట్రిప్​ను అర్ధాంతరంగా వదిలి ఇంటికి వెళ్లారు.

married-michigan-couple
కాల్​ డన్హన్​-లిండా దంపతులు

ట్రిప్​ నుంచి వచ్చిన కొన్ని రోజులకే దంపతులిద్దరూ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. కొన్ని రోజుల పాటు వారిని వెంటిలేటర్​పై పెట్టి చికిత్స అందించారు. అంతకుముందే వారికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయి.

చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం 11:07 గంటలకు కాల్​ మరణించారు. అది జరిగిన ఒక్క నిమిషానికి.. అంటే 11:08కు భార్య లిండా తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో వారిద్దరు చేతిలో చెయ్యి వేసుకునే ఉన్నారు.

టీకా తీసుకున్నా...!

కొవిడ్​పై పోరాటం కోసం ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని ప్రోత్సహించేవారు కాల్​, లిండా. ఈ ఏడాది మేలోనే వీరూ టీకా తీసుకున్నారు. అలాంటిది కొవిడ్​తో వీరు మరణించడం బాధాకరం.

married-michigan-couple
కాల్​ డన్హమ్​, లిండా

లిండాతో పరిచయం ఉన్న వారు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. లిండా చాలా మంచి మనిషి అని, అన్నింట్లోనూ తమకు అండగా ఉంటేవారని గుర్తుచేసుకుంటున్నారు.

married-michigan-couple
చివరి క్షణాల్లో..

బూస్టర్​ డోస్​ తీసుకోవాల్సిందేనా?

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లపై కొవిడ్​ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. వారిలో రోగనిరోధక శక్తి పెరగడం లేదు. అదే సమయంలో రెండు డోసులు తీసుకున్నా.. యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదానిపై స్పష్టత లేదు.

అందువల్ల బూస్టర్​ డోసుకు ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరుగుతోంది. ఒక్లహోమాలో ఓ టీచర్​.. కొవిడ్​ బారిన పడి మృత్యువు అంచువరకు వెళ్లారు. బూస్టర్​ డోసుతో బతికి బయటపడినట్టు ఆమె వివరించారు. కాల్​, లిండా​ దంపతులు బూస్టర్​ డోసు తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు.

అమెరికావ్యాప్తంగా 65శాతం జనాభా కనీసం ఒక్క డోసు తీసుకుంది. 56శాతం జనాభా రెండు డోసులు తీసుకుంది. కాగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ సోమవారం బూస్టర్​ డోసు తీసుకున్నారు.

ఇదీ చూడండి:- 79 వెడ్స్​ 66.. వృద్ధాప్యంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.