ETV Bharat / entertainment

పాకెట్ మనీ డొనేట్ చేసిన సితార.. సమాజ సేవ విషయంలో తండ్రి దారిలోనే..

author img

By

Published : Jan 2, 2023, 11:00 AM IST

Updated : Jan 2, 2023, 1:19 PM IST

mahesh babu foundation sitara
mahesh babu foundation sitara

సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సమాజ సేవలో ముందుంటున్నారు టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. ఈ కొత్త సంవత్సరం మరో అడుగు ముందుకేసి.. మహేశ్​ బాబు ఫౌండేషన్​ వెబ్​సైట్​ ప్రారంభించారు. ఈ మేరకు తన కుమార్తెతో ఓ వీడియో విడుదల చేశారు.

టాలీవుడ్​ సూపర్ స్టార్​ మహేశ్​ బాబు ఓ సినిమా తారగానే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఎంతో మంది చిన్నారులకు అండగా ఉన్నారు. చాలా మంది పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడారు. ఇలా సేవలు చేయడానికి ఓ ఫౌండేషన్​ కూడా స్థాపించారు. కాగా, కొత్త సంవత్సరంలో అలాంటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ ఫౌండేషన్​కు సంబంధించిన వెబ్​సైట్​ను లాంచ్​ చేశారు. అయితే ఈ వెబ్​సైట్​ లాంచ్​లో భాగంగా మహేశ్​ కుమార్తె సితారతో ఓ స్పెషల్​ వీడియో చేసి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది మహేశ్​ బాబు ఫౌండేషన్​.

'పిల్లలు సంతోషంగా ఉండేందుకు ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్​ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే మేము మా అధికారిక వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నాము' అని రాసుకొచ్చింది. దానికి 'ఫర్​ ది చిల్డ్రెన్​​.. టు ది చిల్డ్రెన్​' అని క్యాప్షన్​ జోడించింది. కాగా, ఫౌండేషన్​కు తన పాకెట్ మనీ ఇస్తున్నట్లు తెలిపింది మహేశ్ ముద్దుల కుమార్తె సితార.

"మా ఫ్యామిలీ ఫౌండేషన్​ వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా నాన్న స్టార్ట్​ చేసిన ఈ ఫౌండేషన్​లో నేను పాలు పంచుకోవాలనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. అందుకు ఈ నెల నా పాకెట్​ మనీని మహేశ్​బాబు ఫౌండేషన్​కు డొనేట్​ చేస్తున్నా. మీరు కూడా మీ వంతు విరాళం ఇవ్వండి. మనందరం కలిసి.. పిల్లలు సంతోషంగా నివసించేందుకు ఈ ప్రపంచాన్ని ఓ మంచి ప్రాంతంగా మార్చుదాం" అని సితార పిలుపునిచ్చింది.

Last Updated :Jan 2, 2023, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.