తల్లి ఇందిరా దేవి మృతితో సూపర్ స్టార్ మహేశ్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు మహేశ్. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య.. ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.
తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి జ్ఞాపకాలను తలచుకుంటూ మహేశ్బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించి ఓ పాత ఫొటోను షేర్ చేశారు.
బరువెక్కిన హృదయంతో ఏమి రాయకుండా 'లవ్' ఎమోజీలు జతచేశారు. ఈ పోస్ట్పై పలువురు ప్రముఖులు, లక్షల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. 'మహేశ్ సర్ మీరు ధైర్యంగా ఉండండి', 'మేం మీతో ఉన్నాం అన్నా', 'బాధపడకండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. తల్లి అంటే మహేశ్కు ఎంతో ఇష్టం. ఆమె ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆమెపై ఉన్న ప్రేమను మహేశ్ పలు సందర్భాల్లో చాటారు. ఇందిరా దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు.
-
❤️❤️❤️ pic.twitter.com/7Tlso5B3ia
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">❤️❤️❤️ pic.twitter.com/7Tlso5B3ia
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2022❤️❤️❤️ pic.twitter.com/7Tlso5B3ia
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2022
ఇదీ చూడండి: చిరుత 15 ఇయర్స్.. చిరంజీవి ఎమోషనల్.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే