ETV Bharat / entertainment

తల్లి అంత్యక్రియలు తర్వాత మహేశ్​ పోస్ట్.. లక్షలాది మంది ఫ్యాన్స్ రెస్పాన్స్

author img

By

Published : Sep 28, 2022, 6:59 PM IST

mahesh mother
మహేశ్​ తల్లి

తన తల్లి ఇందిరా దేవి జ్ఞాపకాలను తలచుకుంటూ హీరో మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలు పూర్తైన వెంటనే సోషల్​మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్​ అవుతోంది.

తల్లి ఇందిరా దేవి మృతితో సూపర్ స్టార్ మహేశ్​ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు మహేశ్​. ఒకే ఏడాదిలో అటు అన్నయ్య.. ఇటు తల్లి మరణంతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.

తల్లి అంత్యక్రియలు పూర్తైన తర్వాత సోషల్ మీడియాలో ఇందిరా దేవి జ్ఞాపకాలను తలచుకుంటూ ​ మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యారు. మాతృమూర్తి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించి ఓ పాత ఫొటోను షేర్‌ చేశారు.

బరువెక్కిన హృదయంతో ఏమి రాయకుండా 'లవ్‌' ఎమోజీలు జతచేశారు. ఈ పోస్ట్‌పై పలువురు ప్రముఖులు, లక్షల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. 'మహేశ్‌ సర్‌ మీరు ధైర్యంగా ఉండండి', 'మేం మీతో ఉన్నాం అన్నా', 'బాధపడకండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. తల్లి అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం. ఆమె ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆమెపై ఉన్న ప్రేమను మహేశ్‌ పలు సందర్భాల్లో చాటారు. ఇందిరా దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు.

ఇదీ చూడండి: చిరుత 15 ఇయర్స్​.. చిరంజీవి ఎమోషనల్​.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.