ETV Bharat / entertainment

SSMB 28: మహేశ్​కు జోడీగా మరోసారి రష్మిక?

author img

By

Published : Jun 10, 2022, 11:47 AM IST

mahesh babu rashmika
mahesh babu rashmika

Maheshbabu SSMB 28: సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. దర్శకుడు త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కనున్న SSMB 28కు(వర్కింగ్​ టైటిల్​) సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్​గా ప్రకటించిన చిత్రబృందం.. ఇప్పుడు మరో కథానాయికగా రష్మికను ఎంచుకున్నట్లు సమాచారం.

Maheshbabu SSMB 28: ఇటీవలే 'సర్కారు వారి పాట' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో మహేశ్​బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్​తో చేయనున్నారు. వచ్చే నెలలోనే సెట్స్​పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం 'అర్జునుడు' అనే టైటిల్​ను ఫిక్స్​ చేసినట్లు ఇది వరకు వార్తలొచ్చాయి. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలు మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

SSMB 28 Heroine: హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్​టైన్​మెంట్స్​ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో కథానాయికగా రష్మికను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక సైతం మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో జోడీ కట్టింది. ఇంతకీ SSMB 28లో రష్మిక రెండో హీరోయిన్​గా నటిస్తుందా?.. అసలు ఈ వార్తల్లో నిజమెంత అనేది చూడాలి.

ఇవీ చదవండి: 'సల్మాన్​ ఖాన్​ హత్య బెదిరింపులు వారి పనే.. త్వరలోనే అరెస్ట్​ చేస్తాం'

'కనిపించేంత సరదాగా ఉండను ఏడ్చేస్తా'.. బాడీ షేమింగ్​పై రోహిణి ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.