ETV Bharat / entertainment

'ఎన్టీఆర్​ 30' విలన్​గా సైఫ్​ అలీ ఖాన్! హైఓల్టేజ్​ షూటింగ్​ షురూ!

author img

By

Published : Apr 18, 2023, 1:40 PM IST

బాలీవుడ్​ స్టార్​ నటుడు సైఫ్ అలీ ఖాన్.. ఎన్టీఆర్​ 30 ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం ప్రారంభమైన రెండో షెడ్యూల్​ సెట్స్​లో ఆయవ కనిపించారు. ఈ సినిమా షూటింగ్​లో సైఫ్​ చేరికతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

saif joins with ntr30
saif joins with ntr30

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ - జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో తెరెకెక్కుతున్న 'ఎన్టీఆర్ 30' ఇటీవలే తన తొలి షెడ్యూల్​ ముగించుకుని రెండో షెడ్యూల్​లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్స్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం మొదలైన చిత్రీకరణ కోసం బాలీవుడ్​ స్టార్​ హీరో సైఫ్​ అలీ ఖాన్ హైదరాబాద్​ విచ్చేశారు​. అలా షూటింగ్​ స్పాట్​లో సైఫ్​ కనిపించి సందడి చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్​ ఆర్ట్స్​ ఓ ట్వీట్​ ద్వారా వెల్లడించింది. సెట్స్​లో కొరటాల శివ, ఎన్టీఆర్​లతో పాటు సైఫ్​ సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతున్నాయి.

సెట్స్​లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్​..
మంగళవారం మొదలైన రెండో షెడ్యూల్​లో బాలీవుడ్​ స్టార్ హీరో సైఫ్​తో పాటు బీ టౌన్​ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్​ కూడా ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవలే హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించిన ఈ తార సోమవారమే సినిమా సెట్స్​లోకి అడుగుపెట్టిందట. ఇందులో విశేషం ఏంటంటే..సైఫ్​తో పాటు జాన్వీకి తెలుగులో ఇదే తొలి స్ట్రెయిట్​ సినిమా.

ఇక సినిమా విషయానికి వస్తే.. జనతా గ్యారేజీ తర్వాత కొరటాల-ఎన్టీఆర్.. 'ఎన్టీఆర్​ 30' సినిమా కోసం చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ఓ సినిమా హిట్​ కావడం వల్ల ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంతే కాకుండా జాన్వీ, సైఫ్​ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నందున ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్​కు చెందిన స్టంట్​ సూపర్​వైజర్స్​, వీఎఫఎక్స్ టీమ్​ పని చేయడం విశేషం. మరోవైపు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అనిరుద్​ రవిచందర్​ సంగీతం అందిస్తుండగా.. కెమెరా బాధ్యతలను ఆర్ రత్నవేలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ - జూనియర్​ ఎన్టీఆర్​ కాంబోలో తెరెకెక్కుతున్న 'ఎన్టీఆర్ 30' ఇటీవలే తన తొలి షెడ్యూల్​ ముగించుకుని రెండో షెడ్యూల్​లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్స్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం మొదలైన చిత్రీకరణ కోసం బాలీవుడ్​ స్టార్​ హీరో సైఫ్​ అలీ ఖాన్ హైదరాబాద్​ విచ్చేశారు​. అలా షూటింగ్​ స్పాట్​లో సైఫ్​ కనిపించి సందడి చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్​ ఆర్ట్స్​ ఓ ట్వీట్​ ద్వారా వెల్లడించింది. సెట్స్​లో కొరటాల శివ, ఎన్టీఆర్​లతో పాటు సైఫ్​ సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతున్నాయి.

సెట్స్​లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్​..
మంగళవారం మొదలైన రెండో షెడ్యూల్​లో బాలీవుడ్​ స్టార్ హీరో సైఫ్​తో పాటు బీ టౌన్​ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్​ కూడా ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవలే హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించిన ఈ తార సోమవారమే సినిమా సెట్స్​లోకి అడుగుపెట్టిందట. ఇందులో విశేషం ఏంటంటే..సైఫ్​తో పాటు జాన్వీకి తెలుగులో ఇదే తొలి స్ట్రెయిట్​ సినిమా.

ఇక సినిమా విషయానికి వస్తే.. జనతా గ్యారేజీ తర్వాత కొరటాల-ఎన్టీఆర్.. 'ఎన్టీఆర్​ 30' సినిమా కోసం చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ఓ సినిమా హిట్​ కావడం వల్ల ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంతే కాకుండా జాన్వీ, సైఫ్​ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నందున ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్​కు చెందిన స్టంట్​ సూపర్​వైజర్స్​, వీఎఫఎక్స్ టీమ్​ పని చేయడం విశేషం. మరోవైపు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అనిరుద్​ రవిచందర్​ సంగీతం అందిస్తుండగా.. కెమెరా బాధ్యతలను ఆర్ రత్నవేలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.