ETV Bharat / crime

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసిన కుమార్తె

author img

By

Published : May 3, 2022, 10:43 AM IST

Updated : May 3, 2022, 11:40 AM IST

Attack due to Extra marital Affair: తల్లితో వివాహేతరం సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మాంగాలను ఓ కుమార్తె కోసేసింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె
తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె

Attack due to Extra marital Affair: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్.రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ.. కూలీ పని చేసే రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి మద్యం సేవించిన అనంతరం.. ఆమె నివాసముండే భవనంపై నిద్రిస్తున్నాడు.

Attack due to Extra marital Affair: తన తల్లితో వివాహేతర సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె.. తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. ఈ క్రమంలో తన ప్రియుడి సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు రామచంద్రారెడ్డిని తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తెనాలి టూ టౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మత్తులో పేట్రేగుతున్న మృగాళ్లు.. మహిళలపై సామూహిక అత్యాచారాలు

రాజకీయ కక్షసాధింపులకు కోర్టులు వేదికలా..?: సీజేఐ

Last Updated : May 3, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.