'మహిళలపై దాడుల్లో యూపీ, బిహార్‌ను మించిపోయిన ఏపీ'

author img

By

Published : Dec 20, 2022, 9:33 PM IST

Delhi Central on AP women attacks breaking
మహిళలపై అత్యాచార కేసులో యూపీ,బిహార్​ని మించిపోతున్న ఏపీ ()

Central on AP women attacks : రోజు రోజుకి మహిళలపై అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఎక్కువగా యూపీ, బిహార్​లోనే జరుగుతాయనుకొంటే పొరపాటు పడినట్టే. తాజాగా కేంద్ర హెూంశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్​లో కేసులు పెరుగుతున్నాయని పార్లమెంట్​కి చెప్పింది.

Central on AP women attacks : మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌.. యూపీ, బిహార్‌ని మించిపోతోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు చెప్పింది. గత నాలుగైదేళ్లలో దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కేంద్ర హోం శాఖ.. లైంగిక వేధింపుల్లో అగ్రభాగాన నిలిచినట్లు స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

2018తో పోల్చితే.. 2021 నాటికి మహిళలపై అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం, లైంగిక వేధింపులు 31 శాతం పెరిగాయని కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. 2018 నుంచి 2021 మధ్య కాలంలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు.. 18,883 సాధారణ దాడులు జరిగాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సందర్భంలో దాడులు 2018లో 4,445 ఉంటే... 2021లో 5,108 జరిగాయి.

  • ఆంధ్రప్రదేశ్​లో 2018 నుంచి 2021 వరకు క్రమంగా పెరిగిన అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపుల కేసుల వివరాలు
అంశం2018201920202021
అత్యాచార ఘటనలు971108610951188
లైంగిక వేధింపులు1802189223422370
  • మహిళలపై ఆంధ్రప్రదేశ్​లో 2018తో పోలిస్తే 2021లో పెరిగిన దాడులు వివరాలు.
అంశం2018లో2021లో
దాడులు 44455108
  • ఆంధ్రప్రదేశ్​లో 2018తో పోలిస్తే 2021 పెరిగిన కేసుల వివరాలు
అంశంపెరిగిన శాతంమధ్య కాలంలో జరిగినవి
అత్యాచారాలు224340
దాడులు1518883
లైంగిక/ఆత్మగౌరవానికి భంగం కలిగించేవి 318406

హత్యలు కూడా పెరుగుతున్నట్లు హోం శాఖ పేర్కొంది. ఈ కాలంలో యాసిడ్‌ దాడులు మాత్రం తగ్గినట్లు లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.