ETV Bharat / crime

Two Men Committed Suicide: భార్యలు తిట్టారని.. ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

author img

By

Published : Dec 8, 2021, 10:45 AM IST

Updated : Dec 8, 2021, 11:20 AM IST

two men committed Suicide
ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

10:41 December 08

పురుగులమందు కలుపుకొని తాగి ఇద్దరు బలవన్మరణం

Two men Committed Suicide: సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు లక్ష్మయ్య, వెంకట్​గా గుర్తించారు.

గంజిగూడెంకు చెందిన లక్ష్మయ్య, వెంకట్​పై పలు దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు దొంగతనం చేశారని.. గ్రామస్థులు పంచాయితీకి పిలిచారు. ఈ పంచాయితీకి వారి భార్యలు కూడా వచ్చారు. గ్రామస్థుల ఆరోపణలు విన్న వారి భార్యలు సైతం.. లక్ష్మయ్య, వెంకట్​లను తిట్టారు. కట్టుకున్న భార్యలు తమను అర్థం చేసుకోకుండా దూషించారని ఇద్దరు మనస్తాపం చెందారు. సంగారెడ్డి పాత బస్టాండ్​ వద్దకు చేరుకుని మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి.. బలవన్మరణం చెందారు.

ఇదీ చూడండి: suicide attempt at jagadevpur : తహసీల్దారు కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Last Updated :Dec 8, 2021, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.