ETV Bharat / crime

పొలంలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 26, 2021, 9:00 AM IST

two members dead in road accident, nalgonda car accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, నల్గొండ రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా వల్లభరావు చెరువు వద్ద ఓ కారు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నల్గొండ జిల్లా అద్దంకి-నార్కట్​పల్లి జాతీయ రహదారిపై వల్లభరావు చెరువు వద్ద ఆదివారం రాత్రి ఓ కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను చర్లపల్లి చంద్రగిరి విల్లాస్ కాలనీకి చెందిన గాంధీ మల్ల శ్రీకాంత్, జెర్రిపోతుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రాత్రి వేళలో కత్తులతో విచక్షణారహిత దాడి.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.