ETV Bharat / crime

కేవైసీ ఆప్​డేట్​ నెపంతో ఒకర్ని.. ఉద్యోగం​ పేరుతో మరొకర్ని..!

author img

By

Published : May 13, 2021, 10:45 PM IST

two cyber crimes in hyderabad
two cyber crimes in hyderabad

సైబర్​ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఎదుటివారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు.. ఖాతాను అప్​డేట్​ చేయాలని ఇంకొందరు వలలు పన్ని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇద్దరు బాధితులను మాయ చేసిన సైబర్​ కిలాడీలు ఒకరి నుంచి రెండున్నల లక్షలు, మరొకరి నుంచి లక్ష నగదు కాజేశారు.



హైదరాబాద్​లో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా... ఉద్యోగం పేరుతో, కెవైసీ నెపంతో ఇద్దరు బాధితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు దోచుకున్నారు.

ఉద్యోగం ఎర చూపి...

కుత్బుల్లాపూర్​కు చెందిన యువతికి నౌకరి డాట్​ కామ్ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఓ సైబర్ లేడి ఫోన్​ చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ కొరకు తాను పంపే లింక్ ద్వారా పది రూపాయలు చెల్లించాలని సూచించింది. కేవలం పది రూపాయలే కావటం వల్ల బాధితురాలు వెంటనే ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్​కు యత్నించగా... ఫెయిల్ అయ్యి వెంటనే తన అకౌంట్ నుంచి రూ.21 వేలు మాయమయ్యాయి. తన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని సదరు మహిళను ప్రశ్నించగా.. తప్పు జరిగిందని మరోసారి ప్రయత్నించాలని సూచించింది. ఇలా పలు మార్లు ఆ లింక్ ఓపెన్ చేసి సైబర్ లేడీకి ఓటీపీ చెప్పగా... మరో మూడు విడతల్లో 10,000, 20099, 2,00,986 నగదు డెబిటయ్యాయి. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 2 లక్షల 52 వేల 383 రూపాయలు మాయమయ్యాయి.

కేవైసీ అప్​డేట్​ పేరుతో...

కొంపల్లికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి కేవైసీ అప్​డేట్​ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము పంపే లింక్ ద్వారా కేవైసీ అప్​డేట్​ చేయాలని సూచించగా... కృష్ణరెడ్డి వివరాలతో పాటు ఓటీపీ సైతం ఎంటర్ చేశాడు. వెంటనే తన బ్యాంకు ఖాతా నుంచి 99వేల 999 రూపాయల నగదు మాయమైంది. మోసపోయానని గ్రహించిన ఇద్దరు బాధితులు పేట్​బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చోరీలు, అత్యాచారాలకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్‌: సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.