ETV Bharat / crime

రెండు బైక్​లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Mar 28, 2021, 7:36 PM IST

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో.. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం
రెండు బైక్​లు ఢీ

వేగంగా వచ్చిన బైక్​.. మరో బైక్​ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో జరిగిందీ ఘటన.

దంతాలపల్లికి చెందిన సైదులు.. తొర్రూరు నుంచి సూర్యాపేట వైపునకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద.. నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన దేవేందర్ వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న బైక్​ను ఢీ కొట్టాడు.‌ ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.

స్థానికులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.