ETV Bharat / crime

పల్టీ కొట్టిన ట్రాక్టర్​.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 13, 2021, 3:11 AM IST

Tractor overturned at jaggayyapet mancherial Two persons died
పల్టీ కొట్టిన ట్రాక్టర్​.. ఇద్దరు మృతి

అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జగ్గయ్యపేట సమీపంలో జరిగింది.

మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా చింతగూడకు చెందిన డ్రైవర్ చాండ్ పాషా(30) ఘటనా స్థలంలోనే మరణించగా... అతని వెంట ఉన్న ఇందూరి రవి(35)ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్​ఐ కొమురయ్య తెలిపారు.

వారు కాగజ్​నగర్ మండలం అందవెల్లి నుంచి భీమిని మండలం వీగాంకు సిమెంటు, ఇటుకల లోడు తీసుకువచ్చారు. గ్రామంలో అన్​లోడ్​ చేసి తిరుగు పయనమయ్యారు. ఆ క్రమంలో జగ్గయ్యపేట సమీపంలో అతి వేగంగా ప్రయాణించడం వల్ల ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తాండూరు సీఐ బాబురావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి : తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ చీటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.