ETV Bharat / crime

ఈతకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

author img

By

Published : Mar 1, 2022, 7:01 PM IST

missing in Gundlakamma
missing in Gundlakamma

missing in Gundlakamma river: ఏపీలోని గుంటూరు జిల్లా ఐనవోలు వద్ద గుండ్లకమ్మ నదిలోని మూడు మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు.

missing in Gundlakamma river: ఏపీ గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గల గుండ్లకమ్మ నదిలో.. ఈతకోసం దిగి గల్లంతైన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు వెలికితీశారు. వీరిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. వినుకొండలో ఓ శుభకార్యానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. మరణించిన వారంతా ఆయేషా సిద్ధికా(19) విజయవాడ, హీనా (22)వినుకొండ, ఫీజుల్లా ఖాన్ (19) నర్సారావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీచూడండి: శివరాత్రి రోజే ఘోరం.. యాక్సిడెంట్​లో ఆరుగురు భక్తులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.