ETV Bharat / crime

ఏపీలోని విజయనగరంలో 385 కిలోల గంజాయి పట్టివేత

author img

By

Published : Feb 7, 2021, 12:18 PM IST

three orissa ganja smugglers arrested by police in vehicle checkings at vijayanagaram district
ఏపీలోని విజయనగరంలో 385 కిలోల గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో... గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 385 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయనరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వారి వద్ద నుంచి 385 కేజీల గంజాయి, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 150 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.