ETV Bharat / crime

'వినియోగదారుల్లా వస్తారు... ఆభరణాలు దోచేస్తారు'

author img

By

Published : Feb 15, 2021, 7:37 PM IST

వినియోగదారుల్లా జ్యూయలరీ దుకాణాల్లో ప్రవేశించి... యజమాని, సిబ్బంది దృష్టి మరల్చి వెండి వస్తువులు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 లక్షల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నారు.

theft gang arrested by Northern Zone Task Force
'వినియోగదారుల్లా వస్తారు... ఆభరణాలు దోచేస్తారు'

నగల దుకాణాల్లో సిబ్బంది దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.5లక్షల విలువ చేసే వెండి వస్తువులు, ఆటో, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాకు చెందిన రేణుక, ఆమె బంధువులు బతుకుదెరువు కోసం 15ఏళ్ల క్రితం హైదరాబాద్​కు వలస వచ్చారు. రేణుక నేతృత్వంలో ముఠాగా ఏర్పడి చోరీల బాటపట్టారు. ముఠాలో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి ఆటోలో తిరుగుతూ... ఏదైనా జ్యూయలరీ దుకాణాన్ని ఎంచుకుంటారు. వినియోగదారుల్లా నటిస్తూ.... దుకాణంలో ఉన్న యజమాని, సిబ్బందిని దృష్టి మరల్చి వెండి వస్తువులను దాచేసుకొని... అక్కడి నుంచి జారుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై గతంలోనూ పలు ఠాణాల్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గుమ్మడిదలలో మహిళ దారుణ హత్య... గొంతు కోసి చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.