భర్త అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే.. ఆమె కూడా

author img

By

Published : Aug 30, 2022, 9:15 PM IST

Wife and Husband Sudden Death

Wife and Husband Sudden Death: వారిద్దరిదీ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం.. ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ.. 33 ఏళ్లపాటు కష్టసుఖాలు కలిసి పంచుకున్నారు. వారిద్దరికీ అంత ప్రేమ ఉంది కాబట్టే భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య కూడా తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన కడప శివారులోని విశ్వనాథపురంలో జరిగింది.

Wife and Husband Sudden Death: అనారోగ్యంతో భర్త మృతి చెంది అంత్యక్రియలు అయ్యేలోగానే భార్య మృతిచెందిన ఘటన కడప జిల్లా విశ్వనాథపురంలో జరిగింది. స్థానికంగా ఉంటున్న ప్రభుదానం క్రిస్టఫర్, స్వర్ణలతకు 33 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుదానం కడపలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. స్వర్ణలత మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు.

కొద్ది రోజులుగా క్రిస్టఫర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న స్వర్ణలత గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించింది. భార్యభర్తలు కొన్ని గంటల వ్యవధిలోనే మరణించటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.