ETV Bharat / crime

నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి

author img

By

Published : Apr 7, 2021, 8:52 AM IST

Updated : Apr 7, 2021, 9:20 AM IST

son , father
నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి

08:48 April 07

నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి

8నెలల పసికందు... అభం శుభం తెలియని చిన్నారి. తండ్రి గుండెలపై ఆడుకోవాల్సిన ఆ పసికందును... కన్నతండ్రి చిదిమేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్నే... కడతేర్చాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం తొండుపల్లిలో భార్యాభర్తలు విక్రమ్​,స్పందన నివసిస్తున్నారు. పెళ్లైన ఆరు సంవత్సరాలకు ఓ బాబు పుట్టాడు. విక్రమ్ హెయిల్ కటింగ్ షాప్​లో పనిచేసేవాడు. మద్యానికి బానిసైన విక్రమ్​... రోజు ఇంటికి వచ్చి గొడవపడేవాడు. మంగళవారం కూడా ఇంట్లో గొడవపడి కోపంతో ఆరునెలల పసికందును నీటిసంపులో  పడేశాడు. ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Last Updated : Apr 7, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.