ETV Bharat / crime

మంచు తుపాను బీభత్సం.. తెలుగు దంపతులు గల్లంతు.. భార్య మృతి

author img

By

Published : Dec 27, 2022, 5:29 PM IST

Updated : Dec 27, 2022, 7:35 PM IST

America due to snow storm
అమెరికాలో మంచు బీభత్సం

17:27 December 27

అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. తెలుగు దంపతులు గల్లంతు.. భార్య మృతి

BREAKING
అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. తెలుగు దంపతులు మృతి

Two Telugu couple died in snow storm in America: అమెరికాలోని అరిజోనాలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి తెలుగు దంపతులు గల్లంతయ్యారు. భార్య హరిత మృతదేహం లభించగా.. భర్త నారాయణ మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.

హరితకు సీపీఆర్​ చేసి బతికించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదం అరిజోనా వద్ద గడ్డ కట్టిన సరస్సును దాటుతుండగా చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్​లోనే ఈ దంపతులు స్వగ్రామమైన పాలపర్రుకు వచ్చి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఏపీకే చెందిన మరో వ్యక్తి సైతం గల్లంతయ్యాడు. అతని కోసం సిబ్బంది సహాయచర్యలు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 27, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.