ETV Bharat / crime

చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య!

author img

By

Published : Feb 10, 2021, 7:32 AM IST

Updated : Feb 10, 2021, 10:57 AM IST

student-suicide-at-jankampet-in-edapally-mandal-in-nizamabad-district
మానసిక పరిస్థితి సరిగా లేక విద్యార్థి ఆత్మహత్య!

హాస్టల్​లో ఉంటూ చదువుకునే విద్యార్థి చెరువులో దూకి చనిపోవడం నిజామాబాద్​లో కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేకనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అశోక్ సాగర్ పార్కు చెరువులో దూకి మానసిక పరిస్థితి సరిగా లేని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ అనే విద్యార్థి నిజామాబాద్​లోని ఓ కాలేజీలో చదువుతూ హాస్టల్​లో ఉంటున్నాడని 6వ టౌన్ ఎస్సై సాయన్న తెలిపారు.

విద్యార్థి నిర్మల్ జిల్లా భైంసా మండలం బేగాం గ్రామానికి చెందినవాడని ఎస్సై వెల్లడించారు. మానసిక పరిస్థితి సరిగా లేక... ఒంటరిగా హాస్టల్​లో ఉండడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.

ఇదీ చదవండి: విషాదం: అమ్మనాన్న లేరని యువకుడి ఆత్మహత్య

Last Updated :Feb 10, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.