ETV Bharat / crime

పెట్రోల్​ పోసుకొని నిప్పుంటించుకున్న బీటెక్​ విద్యార్థి.. కారణం దాచే పనిలో కళాశాల

author img

By

Published : Nov 2, 2022, 2:15 PM IST

Student suicide in Guru Nanak Engineering College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్​ ఇంజినీరింగ్​ కళాశాలలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ స్టూడెంట్​ను నగరంలో ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా సదరు కాలేజ్ యాజమాన్యం అసలీ ఘటనను దాచే ప్రయత్నం చేస్తోంది.

student committed suicide
student committed suicide

Student suicide in Guru Nanak Engineering College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్​ ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్న వంశీ పటేల్ (22) అనే విద్యార్థి ఒంటిపై ప్రెట్రోల్​ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనని యాజమన్యం ఇబ్రహీంపట్నంలోని లిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నగరంలో మరో ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమ మహేశ్వరరావు, సీఐ రామకృష్ణ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఘటనపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. మరో వైపు ఈ ఘటన కళాశాల లోపల జీఎం, అడ్మిన్ కార్యాలయం జరగ్గా విషయాన్ని అసలు విషయం చెప్పకుండా ఫోన్ పేలిందంటు ప్రకటించింది. కానీ ఘటనా స్థలంలో ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.