Theft in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ద్విచక్రవాహనం బ్యాగులో పెట్టిన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మల్యాల శివారు రామోజీ తండాకు చెందిన బానోతు శీను మిర్చి అమ్మిన నగదును గుమ్ముడూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకొని వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పని నిమిత్తం ఓ దుకాణంలోకి వెళ్లగా.. ఇద్దరు ఆగంతకులు వాహనంలోని రూ.4 లక్షలు కాజేశారు. డబ్బులు కన్పించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Theft in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ద్విచక్రవాహనం బ్యాగులో పెట్టిన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మల్యాల శివారు రామోజీ తండాకు చెందిన బానోతు శీను మిర్చి అమ్మిన నగదును గుమ్ముడూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకొని వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పని నిమిత్తం ఓ దుకాణంలోకి వెళ్లగా.. ఇద్దరు ఆగంతకులు వాహనంలోని రూ.4 లక్షలు కాజేశారు. డబ్బులు కన్పించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.