ద్విచక్రవాహనం బ్యాగ్​లోంచి రూ.4లక్షలు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు

author img

By

Published : Jul 27, 2022, 11:00 AM IST

Theft in Mahabubabad :

Theft in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో ఓ షాపు ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్రవాహనంలో ఉన్న బ్యాగులో నుంచి నగదును చోరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనం బ్యాగ్​లోంచి రూ.4లక్షలు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు

Theft in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు ద్విచక్రవాహనం బ్యాగులో పెట్టిన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మల్యాల శివారు రామోజీ తండాకు చెందిన బానోతు శీను మిర్చి అమ్మిన నగదును గుమ్ముడూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకొని వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పని నిమిత్తం ఓ దుకాణంలోకి వెళ్లగా.. ఇద్దరు ఆగంతకులు వాహనంలోని రూ.4 లక్షలు కాజేశారు. డబ్బులు కన్పించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.